నిజంనిప్పులాంటిది

Apr 16 2024, 12:04

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడిపై ముస్లిం దేశాల వాగ్వాదం

ఇరాన్ ఆకస్మిక డ్రోన్ మరియు క్షిపణి దాడి తరువాత, అమెరికా, బ్రిటన్ మరియు ఫ్రాన్స్ వంటి పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచాయి. ఇది మాత్రమే కాదు, కొన్ని ముస్లిం దేశాలు కూడా ఇజ్రాయెల్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చాయి. ఇరాన్ ఇజ్రాయెల్ వైపు వందల కొద్దీ డ్రోన్లు మరియు క్షిపణులను ప్రయోగించింది, వీటిలో ఎక్కువ భాగం ఇజ్రాయెల్ గాలిలో కూల్చివేసినట్లు పేర్కొంది.

ఇప్పుడు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ఇరాన్ దాడులకు ఇజ్రాయెల్ ఇప్పటికే సిద్ధంగా ఉందని వెల్లడించింది, ఎందుకంటే అరబ్ దేశాలు టెహ్రాన్ దాడి ప్రణాళికల గురించి నిశ్శబ్దంగా ఇంటెలిజెన్స్ ఇచ్చాయి. ఇరాన్ దాడిని ఆపడంలో ఇజ్రాయెల్ పొరుగున ఉన్న జోర్డాన్ ముఖ్యమైన పాత్ర పోషించింది, అయితే ఈ ప్రాంతంలో పెద్ద మరియు ప్రభావవంతమైన ముస్లిం దేశమైన సౌదీ అరేబియా కూడా దీనికి సహాయం చేసింది.

దాదాపు 7 నెలలుగా గాజా మైదానంలో ఇజ్రాయిల్ సైన్యం యుద్ధం చేస్తోంది. ముస్లిం దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఇజ్రాయెల్‌కు మద్దతివ్వాలని ఏ ముస్లిం దేశం కూడా ఆలోచించదు. కానీ ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన దాడి తరువాత, ఇప్పుడు ముస్లిం దేశాలు చీలిపోతున్నాయి. ఇరాన్ దాడికి ముస్లిం దేశాలు మద్దతు ఇస్తుండగా, ఇరాన్ దాడిని ఖండించిన కొన్ని ముస్లిం దేశాలు కూడా ఉన్నాయి. వీటిలో అతిపెద్ద మరియు మొదటి పేరు జోర్డాన్ మరియు రెండవది సౌదీ అరేబియా.

అరబ్ దేశాలు యుద్ధ విమానాల కోసం తమ గగనతలాన్ని తెరిచాయని, రాడార్ నిఘా సమాచారాన్ని పంచుకున్నాయని మరియు కొన్ని సందర్భాల్లో తమ సైన్యాల సేవలను కూడా అందించాయని అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇరాన్ దాడి చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, ఇజ్రాయెల్ వైపు ప్రయోగించిన డ్రోన్‌లు మరియు క్షిపణులను అడ్డగించేందుకు అమెరికా అధికారులు ప్రాంతీయ అరబ్ ప్రభుత్వాలను ఒత్తిడి చేశారని సౌదీ మరియు ఈజిప్టు అధికారులు నివేదించారు.

టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఉత్తర మరియు మధ్య జోర్డాన్ గుండా ఇజ్రాయెల్ వైపు ఎగురుతున్న డజన్ల కొద్దీ డ్రోన్‌లను జోర్డాన్ జెట్‌లు కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ సైనిక మూలాన్ని ఉటంకిస్తూ పేర్కొంది. ఇజ్రాయెల్‌కు సహాయం చేయడానికి జోర్డాన్ తన జెట్‌లను పంపడం ఒక పెద్ద అడుగు, ఎందుకంటే అమ్మన్ గతంలో గాజాలో దాని ఆపరేషన్ కోసం ఇజ్రాయెల్‌ను తీవ్రంగా విమర్శించారు. డ్రోన్లు జోర్డాన్ లోయ వైపు గాలిలోకి ప్రయోగించబడ్డాయి మరియు జెరూసలేం వైపు వెళ్లినట్లు సోర్సెస్ చెబుతున్నాయి. మరికొందరిని ఇరాకీ-సిరియా సరిహద్దు దగ్గర నిలిపివేశారు. వారు తదుపరి వివరాలను అందించడం లేదు.

ఇజ్రాయెల్ మీడియా ప్రకారం, జోర్డాన్ జెట్‌లు ఉత్తర మరియు మధ్య జోర్డాన్ గుండా ఇజ్రాయెల్ వైపు ఎగురుతున్న డజన్ల కొద్దీ డ్రోన్‌లను కూల్చివేసాయి. అయితే దీనికి ముందు, గాజా యుద్ధ సమయంలో, జోర్డాన్ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిలిచింది. ఇప్పుడు పరిస్థితి మారిందని నిపుణులు భావిస్తున్నారు. సౌదీ అరేబియా కూడా ఇరాన్ దాడిని ఖండించింది, ఇది ప్రపంచానికి మంచిది కాదని వివాదాన్ని పెంచుతుందని పేర్కొంది. ఇరాన్ చర్యల పట్ల సౌదీ అరేబియా అసంతృప్తిగా ఉన్నట్లు కూడా స్పష్టమైంది. ఇది కాకుండా, ఇరాన్ చేసిన ఈ దాడిపై ఇతర ముస్లిం దేశాలు కూడా మౌనం వహించాయి. ఈ దాడి తర్వాత ముస్లిం దేశాల మధ్య చీలిక ఇరాన్‌కు మంచి సంకేతం కాదు. దీని కారణంగా ఇరాన్ ఉద్రిక్తత ఖచ్చితంగా పెరుగుతుంది.

నిజంనిప్పులాంటిది

Apr 16 2024, 10:17

తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ భక్తుల సర్వదర్శనానికి 10గంటల సమయం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది..

తిరుమల శ్రీవారిని నిన్న 77వేల 511 మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు..

ఇక రేపు శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించనున్నారు. రేపు రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై మలయప్పస్వామి ఊరేగనున్నారు.

ఈ నేఫథ్యంలో శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు..

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Apr 16 2024, 10:16

తెలంగాణకు వడగాలుల ముప్పు.. నేడు, రేపు పెరగనున్న ఎండలు

హైదరాబాద్‌: ఎండల తీవ్రత పెరుగుతోంది. సోమవారం కన్నా మంగళ, బుధవారాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది..

దీంతోపాటు రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ప్రధానంగా బుధవారం కొన్ని జిల్లాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది..

Streetbuzz News

SB NEWS

నిజంనిప్పులాంటిది

Apr 16 2024, 10:12

రాజీనామా చేస్తే రూ.15వేలు ఆఫర్.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిళ్లు

ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా కొందరు వైకాపా నాయకులు, పాలకుల లక్ష్యం ఒక్కటే.. గ్రామ వాలంటీర్లతో రాజీనామా చేయించడమే. రహస్యంగా వాలంటీర్లను ఓ ప్రాంతానికి రప్పించుకుని సమావేశాలు నిర్వహించడం, రాజీనామాలకు ఒత్తిడి తీసుకురావడం పరిపాటిగా మారింది..

కొందరు విముఖత చూపడంతో వారినీ ఒప్పించేందుకు కొత్త ఆఫర్లను ప్రకటిస్తుండటం కనిపిస్తోంది. బరిలో ఉన్న అభ్యర్థి ద్వారా ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తారని చెబుతుండటం గమనార్హం.

అలాగే, మళ్లీ అధికారంలోకి రాగానే మీ ఉద్యోగం తిరిగి ఇస్తామనే హామీలూ గుప్పిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు వాలంటీర్లు ఇష్టం లేకపోయినా రాజీనామాలకు సిద్ధమైనట్లు సమాచారం. సోమవారం కొత్తపల్లి మండలంలోని కొన్ని తీరప్రాంత గ్రామాల్లో ఇదే తరహాలో బేరసారాలు జరిగాయి..

రోజుకు నలుగురిని మార్చాలంట! : నాయకులు ఆఫర్‌కు తోడు.. కొన్ని నిబంధనలనూ ప్రస్తావించడం క్షేత్రస్థాయిలో చర్చగా మారింది.

రాజీనామా చేసిన వాలంటీర్లు వైకాపా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించడంతో పాటు.. ఒక్కొక్క వాలంటీర్‌ రోజుకు కనీసం నలుగురిని కలసి వైకాపాకు ఓటేసేలా చేయాలన్నది ఆ మాటల సారాంశం. ఇలా చేసినందుకు తమ నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుందని భరోసా ఇస్తుండటం భారీగా చర్చగా మారింది..

నిజంనిప్పులాంటిది

Apr 16 2024, 10:00

రేపు మద్యం దుకాణాలు బంద్

రాష్టంలో ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో మద్యం దుకాణాలు మూసివేయిస్తుంటారు.

ఈ క్రమంలోనే తాజగా శ్రీరామనవమిని పురస్క రించుకొని హైదరాబాద్‌ జంట నగరాల్లో ఒకరోజు మద్యం దుకాణాలు బంద్‌ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

రేపు 17వ తేదీ బుధవారం మద్యం దుకాణాలు బంద్‌ కావాల్సిందే అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు హైదరా బాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు.

ఎవరైనా ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎవరైనా మద్యం దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూ డదనే ఉద్దేశంతో..

ఏప్రిల్ 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న వైన్స్‌, కల్లు కాంపౌండ్లు, బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లు అన్నీ మూతపడనున్నాయి.

ఈ మేరకు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

నిజంనిప్పులాంటిది

Apr 16 2024, 09:58

అయోధ్య లో నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీ రామ నవమి వేడుకలు

శ్రీరామనవమి వేడుకల సందర్భంగా రామజన్మ భూమి అయోధ్యనగరి సర్వాంగా సుందరంగా ముస్తాబవుతుంది.

ఈ సందర్భంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఆయోద్య రామ మందిరాన్ని 20 గంటల పాటు భక్తుల కోసం తెరచి ఉంచాలని నిర్ణయించారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట అనంతరం తొలి శ్రీరామన వమి కావడంతో అధికారు లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

దాదాపు 40 లక్షల మంది వేడుకలకు హజరవుతారని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీరామ మందిర్ ఆలయ ట్రస్టు ఏడు వరుస ల్లో భక్తులను దర్శనానికి అనుమంతించాలని నిర్ణయించింది.

శ్రీరామనవమి వేడుకలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నయా ఘాట్ జోన్, నాగేశ్వర నాథ్ జోన్, హనుమాన్ గర్హి టెంపుల్ జోన్, కనక్ భవన్ టెంపుల్ జోన్ సహా ఇతర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పా ట్లు చేపడుతున్నారు.

భక్తులక సౌకర్యార్ధం 24 గంటల పాటు పని చేసే విధంగా కంట్రోల్ రూం ను ఏర్పాటు చేశారు. మూడు షిఫ్టుల్లో అధికారులను నియమించనున్నారు. రామజన్మభూమి మార్గంలో అదనంగా 80 సీసీ కెమెరా లు,. 50 చోట్ల వాటర్ కూలర్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 16 2024, 09:57

నేడు సంగారెడ్డి జిల్లా లో కెసిఆర్ భారీ బహిరంగ సభ

ఇవాళ సంగారెడ్డి జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్య టించనున్నారు. సుల్తాన్‌ పూర్‌లోని బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.

ఈ సభలో కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ ఎస్‌ అభ్యర్థులను గెలిపిం చాలని కోరనున్నారు.

దీంతో సుల్తాన్‌పూర్‌ బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేసింది.

మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోని సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని అందోల్‌, నారాయణఖేడ్‌, జహీరా బాద్‌ నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరు కానున్నారు.

యువత, రైతులు, మహి ళలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా బీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేపట్టింది...

నిజంనిప్పులాంటిది

Apr 16 2024, 09:54

నేడు ఆదిలాబాద్‌లో కేటీఆర్ ఎన్నికల ప్రచారం

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచా రాన్ని పార్టీలు వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ ఈరోజు ఆదిలాబాద్‌లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు..

ఎన్నికల్లో అనుసరించా ల్సిన వ్యూహంపై కార్య కర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్‌ బహిరంగసభలో కేటీఆర్‌ పాల్గొననున్నారు.

Streetbuzz News

SB NEWS

నిజంనిప్పులాంటిది

Apr 16 2024, 09:52

చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వర్షం కురిపించిన సన్ రైజర్స్ హైదరాబాద్

పరుగుల సునామీ పారిన ఉత్కంఠ పోరులో సన్‌రైజ ర్స్,హైదరాబాద్ విజయం సాధించింది. రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 25 పరగుల తేడాతో గెలుపొందింది.

సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చిన్నస్వామి స్టేడియం జరి గిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 288 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.

ట్రావిస్ హెడ్ 102 (41 బంతుల్లో 9×4, 8×6) సెంచరీతో విజృంభించగా అతనికి తోడు హెన్రీచ్ క్లాసెన్ 67 -31 బంతుల్లో 2×4, 7×6-,ఎయిడెన్ మార్క్మ్ 32,17 బంతుల్లో 2×4, 2×6,అబ్దుల్ సమద్ 37 (10 బంతుల్లో 4×4, 3×6, మెరుపులు మెరిపిం చడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్ దిగిన బెంగళూరు ధీటైన జవాబు నే ఇచ్చింది. విరాట్ కోహ్లీ (42), డూప్లెసిస్(62)లు శుభారంభాన్ని అందించినా మిగతా బ్యాటర్లు రాణించ కపోయారు. మిడిలార్డర్‌లో వచ్చిన దినేశ్ కార్తీక్(83) కాసేపు మెరినా ఫలితం దక్కిలేదు.

దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు ఏడు వికెట్లు కోల్పోయి 262 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ మరో ఆల్‌టైమ్ రికార్డ్‌ను నమోదు చేసింది. టి20 క్రికెట్ చరిత్ర లోనే అత్యంత భారీ స్కోర్ రికార్డ్ తన పేరిటే ఉండగా దానిని బద్దలు కొట్టింది...

నిజంనిప్పులాంటిది

Apr 15 2024, 16:47

ఎన్నికల్లో ధన వర్షం రోజుకు రూ.100కోట్లు సీజ్!

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురికాకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) అన్ని చర్యలు తీసుకుంటోంది..

ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్చి 1 నుంచి నిత్యం సగటున రూ.100 కోట్ల విలువైన నగదు ఇతర తాయిలాలను అధికారులు సీజ్‌ చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న తనిఖీల్లో ఇప్పటి వరకు మొత్తంగా రూ.4650 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది..

2019తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని తెలిపింది. అంతేకాకుండా లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో ఎన్నడూ తాయిలాలను సీజ్‌ చేయలేదని పేర్కొంది. ఎన్నికల్లో ధనప్రవాహం, ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ తనిఖీలు ముమ్మరం చేస్తామని చెప్పింది.

దేశవ్యాప్తంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, నిఘా బృందాలతో సహా సరిహద్దు చెక్‌పోస్టులు నిరంతరం పనిచేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. మాదకద్రవ్యాల రవాణాతోపాటు నగదు, మద్యం, తాయిలాల పంపిణీని అడ్డుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది.

ఇదిలాఉంటే, ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌ 4న లెక్కింపు ఉంటుంది..